పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వెంకటరావుపల్లి నుండి ముస్తాపురం గ్రామానికి పొగాకు గ్రేడింగ్ పనుల కోసం వ్యవసాయ కూలీలు ఆటోలో వెళుతుండగా, ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు