సివిల్స్ లో మెరిసిన హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామ వాసి..

Warangal Bureau
1 Min Read

ఆత్మకూరు, ప్రజాజ్యోతి::

సివిల్స్ లో మెరిసిన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామ వాసి..

సివిల్స్ లో హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ళ గ్రామ వాసి ర్యాంక్ సాధించాడు. యూపీఎస్సీ ఫలితాల్లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ‘పోతరాజు హరిప్రసాద్’ 255 వ ర్యాంక్ సాధించాడు. యూపీఎస్సీ-2024 సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఆ ఫలితాలలో జాతీయ స్థాయిలో 255 వ ర్యాంకు తో పోతరాజు హరి ప్రసాద్ మెరిసాడు. తండ్రి పోతరాజు కిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నల్లబెల్లి మండలం నందిగామ లో విధులు నిర్వర్తిస్తుండగా.. తల్లి విజయ గృహిణి. కొన్ని రోజుల క్రితం వీరు హనుమకొండ లో నివాసం ఉంటున్నారు. ఇతని ప్రాధమిక విద్య ఆర్యభట్ట పాఠశాలలో, ఇంటర్ నారాయణ కాలేజీ లో పూర్తి చేశాడు. బిటెక్ అనంతరం కొంత కాలం జపాన్ లో ఉద్యోగం చేసి సివిల్స్ పై శ్రద్ధ పెట్టి మూడవ అటెంప్టులో ర్యాంకు సాధించాడు. దీనితో మూడు గ్రామాల ప్రజలు ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నారు. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *