ఆటోలో పోగోట్టుకున్న ఆభరణాల బ్యాగు మిస్…..తిరిగి బాధితుడికి అప్పగింత
-నిడమనూరు ఎస్ఐ సురేష్ ఆదేశాలతో కానిస్టేబుల్ కిరణ్ కృషి తో తిరిగి బాధితుడికి అప్పగింత
నిడమనూరు,ఏప్రిల్ 21(ప్రజాజ్యోతి): ఓ వ్యక్తి ఆభరణాల బ్యాగును ఆటోలో పోగోట్టుకున్న సంఘటన నిడమనూరు మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.నిడమనూరు ఎస్ఐ ఉప్పులసురేష్ తెలిపిన వివరాల ప్రకారం నిడమానూరు గ్రామానికి చెందిన
అన్నెబోయిన శివకుమార్ హైదరాబాదులో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం సుమారు 07.30 సమయంలో శివకుమార్ స్వగ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ కు వెళ్లే సమయంలో 25 తులాల వెండి,ఇతర ఆభరణాలు ఉన్న బ్యాగుతో ఆటోలో ఆలీనగర్ (చెక్ పోస్ట్) ప్రాంతంలో ఆటోలో బ్యాగును పోగోట్టుకున్నాడు.వెంటనే బాధితుడు నిడమనూరు ఎస్ఐ సురేష్ సంప్రదించగా నిడమనూరు ఎస్ఐ ఉప్పులసురేష్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ కిరణ్ సీసీ కెమెరాల ద్వారా ఆటోని గుర్తించి, ట్రేస్ చేసి తిరిగి ఆభరణాలు పోగుట్టుకున్న అన్నెబోయిన శివకుమార్ కు తిరిగి అతని బ్యాగులో ఉన్న 25 తులాల వెండి,ఇతర ఆభరణాలు కలిగిన బ్యాగును బాధితుడికి నిడమనూరు ఎస్ఐ సురేష్ చేతుల మీదుగా తిరిగి అప్పగించారు.ఈ విషయం పై పలువురు ఎస్ఐ సురేష్ ని అభినందించారు.