ఈసారి హైదరాబాద్ లో మోఢీలిమిటేషన్

V. Sai Krishna Reddy
1 Min Read

కేంద్రం డీలిమిటేషన్ ని అమలు చేయాలనుకుంది. అది చాలా సజావుగా సాగిపోతుంది అని కూడా భావించింది. కానీ అనుకోని అవాంతరంగా తమిళనాడు నుంచి తొలి వ్యతిరేకత వ్యక్తం అయింది. డీఎంకే రూపంలో మోడీని ఢీ కొట్టేందుకు రంగం సిద్ధం చేయడమే కాదు కేంద్రం తలపెడుతున్న డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు కీలక నేతలను డీఎంకే కూడగట్టడం జరిగింది

అలా చెన్నై వేదికగా డీఎంకే ఇచ్చిన ఆహ్వానం మేరకు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఒక విధంగా ఈ భేటీని సక్సెస్ చేశాయి.డీలిమిటేషన్ వల్ల కలిగే ముప్పుని ఎలుగెత్తి చాటాయి. ఒక విధంగా ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధం చేశాయి.

ఈ సందర్భంగా డీఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ తాము కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో అది దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా న్యాయంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ మీద తరువాత అఖిలపక్ష సమావేశం హైదరాబాద్ లో పెట్టాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దానికి స్టాలిన్ అంగీకరించారు. దాంతో వచ్చే అఖిలపక్ష సమావేశం హైదరాబాద్ లో ఉండవచ్చు అని అంటున్నారు.
అయితే డీఎంకే పిలిస్తే వచ్చిన బీఆర్ ఎస్ సహా కొన్ని పార్టీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక వైసీపీ అయితే డీలిమిటేషన్ మీద తమ స్టాండ్ ఏంటో చెబుతూ జగన్ ప్రధానికి రాసిన లేఖ ప్రతిని స్టాలిన్ కి అందించింది. ఒక విధంగా స్టాలిన్ అంటే సానుకూలతనే వైసీపీ వ్యక్తం చేస్తోంది. మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో మీటింగ్ పెడితే వైసీపీ అసలు హాజరు కాదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *