609 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

V. Sai Krishna Reddy
1 Min Read

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 74,340 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 22,544 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి రూ. 87.12 వద్ద ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏషియన్ పెయింట్స్ (4.70%), ఎన్టీపీసీ (3.41%), రిలయన్స్ (2.96%), టాటా స్టీల్ (2.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.39%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.31%), కోటక్ బ్యాంక్ (-0.96%), జొమాటో (-0.62%), టాటా మోటార్స్ (-0.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.07%).

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *