ఆత్మకూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

Warangal Bureau
1 Min Read

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఆ  భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వారు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ బోగస్ హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిఆర్ఎస్ సత్తా చాటుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *