మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్
నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లు
సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేసిన మేఘా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి
మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు
ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు
చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది
అయితే ఇక్కడే ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్లో ఒక అక్షరం మార్చి.. కొన్ని కారణాలవల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు మరో అకౌంట్ కి డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి మెయిల్ పంపించిన సైబర్ నేరగాళ్లు
అది నిజమని నమ్మి 5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించిన మేఘా కంపెనీ
అదే కంపెనీ నుండి మరో మెయిల్ డబ్బులు ఇంకా చెల్లించలేదని రావడంతో.. మోసపోయామని గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేసిన మేఘా కంపెనీ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు