ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

V. Sai Krishna Reddy
1 Min Read

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన భారీ మ్యూజికల్ నైట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. ఈవెంట్ లో ఆయన ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టికెట్ కొనాలని నా సిబ్బందికి చెప్పాను. ఈ విషయం తెలిసి నారా భువనేశ్వరి గారు… టికెట్ ఎందుకండీ… మీరు కార్యక్రమానికి రండి చాలు అన్నారు. కానీ నాకు టికెట్ కొనకుండా రావడం గిల్టీగా అనిపిస్తోంది. అందుకే నా వంతుగా తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను.

నా దగ్గరికి కూడా కొందరు బాధితులు వస్తుంటారు. అలాంటి వారికి సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కార్యాలయానికి లేఖ రాస్తే ఆయన స్పందన అద్భుతంగా ఉంటుంది. ఎంత సేపూ పనేనా… సహాయంలోనూ వినోదం పొందవచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అభినందనలు.

ఇక, నారా భువనేశ్వరి గారంటే నాకు అమితమైన గౌరవం. ఆమె ఎంత దృఢసంకల్పం ఉన్న వ్యక్తో నాకు తెలుసు. కష్టనష్టాల్లో ఆమె వెనుకంజ వేయకుండా నిలిచిన తీరు స్ఫూర్తిదాయకం. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే… ఆయనను ఎప్పుడు కలిసినా సర్ అని పిలవాలనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం బాలయ్య అని పిలువు అంటుంటారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *