రూ. 90 లక్షల బంగారు, వజ్రాభరణాలు, నగదు స్వాధీనం*
పేరుమోసిన మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ ను అరెస్టు చేసిన అనంత పోలీసులు
అనంతపురం శ్రీనగర్ శివారు కాలనీలో 18 రోజుల కిందట జరిగిన చోరీ కేసు ఛేదింపు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS
4 పోలీసు బృందాలను రంగంలోకి దించి మధ్యప్రదేశ్ మారుమూల గ్రామాలలో సైతం జల్లెడ పట్టిన వైనం.. విరివిగా టెక్నాలజీ వినియోగం
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పోలీసులకు ఈ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్లు విచారణలో వెల్లడి
ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురిలో గ్యాంగ్ లీడర్ పై ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో 32 కేసులు
ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS
అనంతపురం: అనంతపురం శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లోని 3 విల్లాస్ లో జరిగిన చోరీ కేసులను అనంతపురం పోలీసులు ఛేదించారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ ఈ చోరీలకు పాల్పడినట్లు అనంతపురం పోలీసులు తేల్చారు. ధార్ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు.
అరెస్టయిన ధార్ గ్యాంగ్ వివరాలు:
1) నారు పచావర్, చడ్ వాడ్ గ్రామం, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం
2) సావన్ @ శాంతియ దుడ్వే, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం
3) సునీల్ , పిపాల్డిల్యా గ్రామం, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం
పరారీలో ఉన్న గ్యాంగ్ సభ్యులు:
మహబత్, మోట్ల (ఈ ఇద్దరిదీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లానే)
సుమారు రూ. 90 లక్షల విలువ చేసే 59 తులాల బంగారు వస్తువులు మరియు వజ్రాలు పొదిగిన ఆభరణాలు మరియు రూ.19,35,000/- నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లు 22-01-25 న అనంతలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ.. స్థానిక శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లోని శివారెడ్డి, రంజిత్ రెడ్డి, శివశంకర్ నాయుడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఇళ్లకు తాళం వేయడంతో ఎవరూ లేనిసమయంలో చొరబడి సుమారు రూ. 2.13 కోట్లు విలువ చేసే బంగారు వస్తువులు, వజ్రాభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు మేరకు స్థానిక 4 వ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ.. రంగంలోకి 4 ప్రత్యేక పోలీసు బృందాలు ఈ చోరీలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS సిరియస్ గా తీసుకున్నారు. చోరీలు జరిగిన ఇళ్లల్లో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను పంపి ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్పీ, అనంతపురం అర్బన్ డీఎస్పీలతో పాటు సిసిఎస్ పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను సందర్శించి జరిగిన తీరుపై ఆరా తీశారు. అంతేకాకుండా.. ఈ చోరీ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించేందుకు 4 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు వెళ్లి గాలించారు. దీంతో పాటు టెక్నాలజీని కూడా విరివిగా వినియోగించారు. అనంతలో చోరీలు మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ పనే.. ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరైన నారు పచావర్, సావన్ మరియు పరారీలో ఉన్న మహబత్, మోట్ల లు మొత్తం నలుగురు కలసి గత నెల 16 వ తేదీన తమ స్వగ్రామం నుండీ దొంగతనాలు చేయాలనే ఉద్ధేశ్యంతో బయల్దేరి ఇండోర్, ఇటార్చి వరకు బస్సులో.. అక్కడీ నుండీ నేరుగా తమిళనాడులోని సేలంకు రైలులో చేరుకున్నారు. అటు నుండీ ధర్మపురికి వెళ్లి 2 బైకులను దొంగలించి బెంగుళూరు మీదుగా దొంగలించిన టూవీలర్లపై పెనుకొండ వైపు బయల్దేరి వచ్చారు. పెనుకొండ సమీపంలో వీరు వస్తున్న బైకులలో ఒక దానికి రిపేరు రావడంతో అక్కడే వదిలేశారు. సమీపంలో ఉన్న ఒక బైకు ను పెనుకొండ సమీపంలో దొంగలించి టూవీలర్స్ పై 21-01-25 తేదీ ఉదయం అనంతపురం చేరుకున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ అనంతపురంలోని శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లో తాళం వేసిన ఇళ్లపై రెక్కీ చేశారు. ఆ విల్లాస్ లో ఉన్న శివారెడ్డి, రంజిత్ రెడ్డి, శివశంకర్ నాయుడు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. నారు పచావర్, సావన్ ,మహబత్, మోట్ల లు 22-01-25 తేదీ తెల్లవారుజామున ఆ మూడిళ్లకు తాళాలు పగులగొట్టి ఆ ఇంట్లో చొరబడ్డారు. ఆ ఇళ్లల్లో ఉన్న విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు ఊడ్చుకెళ్లారు. చోరీలు తర్వాత హైదరాబాద్ కు చోరీ బైకులలో వెళ్లి.. దొంగ సొత్తు వాటాలుగా పంచుకుని
అనంతలో చోరీలు చేశాక ధర్మపురి, పెనుకొండలలో దొంగలించిన 2 టూవీలర్లలో నలుగురు గ్యాంగ్ అనంతపురం నుండీ హైదరాబాదు వెళ్లారు. ఎత్తుకెళ్లిన సొమ్ము, నగదును అక్కడ వాటాలుగా పంచుకున్నారు. నారు పచావర్, సావన్ లో హైదరాబాద్ లో ఉంటూ దొంగ సొత్తును విక్రయించే ప్రయత్నం చేయగా కుదర్లేదు.. అక్కడ అమ్మడం అసాధ్యమని భావించి దొంగలించిన సొమ్ములను బెంగుళూరులో అమ్మే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సాధ్యపడలేదు. కడకు.. మధ్యప్రదేశ్ కు చెందిన రిసీవర్ రమేష్ ను ఫోన్లో సంప్రదించి చోరీ సొమ్మును కొనాలని కోరారు. రమేష్ దొంగ సొత్తులను కొనడంలో దిట్ట కావడంతో తనకు కుదరక తన కొడుకైన సునీల్ ను పంపాడు. ఈ ముగ్గురు స్థానిక రాయల్ నగర్ లో బేరం చేసుకుంటుండగా జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సి.ఐ లు కనుమూరి సాయినాథ్, హేమంత్ కుమార్, జయపాల్ రెడ్డి, ఎస్సైలు రాంప్రసాద్, రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది బృందంగా ఏర్పడి ఆదివారం స్థానిక రాయల్ నగర్ సమీపంలో అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా… అనంతపురం చోరీల్లో పాల్గొన్న మహబత్, మోట్లలు హైదరాబాద్ లో నారు పచావర్, సావన్ లు తో దొంగసొత్తులను వాటాలుగా పంచుకున్న తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లారు. రిసీవర్ సునిల్ తండ్రి అయిన రమేష్ కూడా పరారీలో ఉన్నట్లు విచారణలో తేలింది. అందరూ పాత నేరస్తులు.. పదుల సంఖ్యల్లో కేసులు ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురు పరారీలో ఉన్న ఇద్దరు కూడా పాత నేరస్తులే. ఈ ఐదుగురిలో నారు పచావర్, మహబత్ లు ముఖ్యులు. స్వయాన ఇద్దరూ అన్నదమ్ములు. వీరికి మిగితా ముగ్గురు సోదరులుంటే వారు కూడా నేరస్తులే. ప్రస్తుతం వారు కూడా హైదరాబాద్ లోని జైలులో ఉంటున్నారు. నారు పచావర్ పై ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో సుమారు 32 కేసులు ఉన్నట్లు సమాచారం ఉంది. మహబత్ పై కూడా నాలుగు రాష్ట్రాలలో సుమారు 29 కి పైగా కేసులున్నాయి. సావన్, సునీల్, మోట్లలపై కూడా కేసులు ఉన్నాయి. సునీల్ పై 9 కేసులు… ఈయన తండ్రి రమేష్ పై కూడా ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో సుమారు 34 కేసులు ఉన్నట్లు వెల్లడైంది. వీరు అంతర్రాష్ట్ర దొంగలు. పరారీలో ఉన్న గ్యాంగ్ సభ్యుల కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. 4 రాష్ట్రాలలో ధార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో ధార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గా ఉంటోంది. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురు మరియు పరారీలో ఉన్న ఇద్దరితో పాటు సుమారు 60 మంది దాకా ఈ గ్యాంగ్ లో సభ్యులు ఉంటారు. అయితే ఐదారుగురు కలిసి గ్యాంగ్ గా ఏర్పడి చోరీలు చేస్తారు. వీరంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా టాండ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన వారే. వ్యవసాయ కూలీల వృత్తిని జీవనం కోసం ఎంచుకుని ప్రవృత్తి మాత్రం దొంగతనాలు చేయడం వీరికి రివాజుగా మారింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను టార్గేట్ చేయడం… పగలు రెక్కీ రాత్రివేళల్లో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ కు పరిపాటి. చిన్న వయస్సుల్లోనే పెళ్లిళ్లు చేసుకోవడం, చెడు వ్యసనాలకు అలవాటు పడటం వెరసి డబ్బు సులువుగా సంపాదించాలని చోరీలు ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. కొసమెరుపు: 4 రాష్ట్రాలలో తాళం వేసిన ఇళ్లల్లో దొంగలించిన సొత్తులను రిసీవర్ రమేష్ కు విక్రయించడం సదరు గ్యాంగ్ సభ్యులు అలవాటుగా చేసుకున్నారు. సాధారణంగా బంగారు వస్తువులు క్రయ, విక్రయాల సందర్భంగా తూకం వేయడం కీలక ప్రక్రియ. ఆసమయంలో గ్రాములే కాకుండా క్యారెట్ వారీగా పరిగణలోకి తీసుకుని లెక్కగట్టి చెల్లింపులు చేస్తారు. ఇక్కడ మాత్రం విచిత్రం. దొంగ సొత్తును కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి తూకం లేకుండా అందాజుగా లెక్కకట్టి తోచినంత మొత్తం చెల్లించడం… అదే డబ్బును తలాడించి తీసుకోవడం జరుగుతుండటం కొసమెరుపు. కష్టపడి కొనిన సొమ్మలకయితే లెక్కలు ఉంటాయి ఆయాచితంగా వచ్చిన సొమ్ములను ఎంతకో ఒకంతకు అమ్మి ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడమే ధార్ గ్యాంగ్ సభ్యులు ధ్యేయంగా పెట్టుకున్నారు. శ్రమించిన ప్రత్యేక పోలీసు బృందాలకు ఎస్పీ ప్రశంస: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉంటూ పలు చోరీలకు పాల్పడిన ధార్ గ్యాంగ్ ను అరెస్టు చేసిన అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సి.ఐ లు కనుమూరి సాయినాథ్, హేమంత్ కుమార్, జయపాల్ రెడ్డి, ఎస్సైలు రాంప్రసాద్, రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS అభినందించారు….