అందుబాటులో సరిపడా యూరియా..

Bharath Goud
1 Min Read
  • ఏడీఏ సంధ్యారాణి

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మండలంలో రైతులకు సరిపడ యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని , ఎరువుల కొరత లేదని సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిని దీపికతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని యూరియా నిల్వలను, విక్రయాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందకుండా తమ పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డులను చూపి సాగు భూమికి తగినంత ఎరువులను తీసుకోవాలని సూచించారు. డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని, ఎకరానికి మూడు బ్యాగుల చొప్పున మాత్రమే విక్రయాలు జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *