సీనియర్ నేత జానారెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని పరామర్శించారు. ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జానారెడ్డి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్శనకు సంబంధించిన వివరాలను, ఫోటోలను ముఖ్యమంత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. సీనియర్ నేత ఆరోగ్యం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

1946 జూన్ 20న జన్మించిన జానారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *