ఇటీవల విమానాలను భారీగా రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్లైన్స్, వారికి పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో విమానాశ్రయాల్లో గంటల తరబడి చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఈ నెల 26 నుంచి రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను జారీ చేయనుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రూ.5,000 నుంచి రూ.10,000 పరిహారానికి ఇది అదనం. విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ సిన్హా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రయాణికులందరికీ తక్షణమే చెల్లింపులు జరిగేలా చూడాలని ఇండిగోను ప్రభుత్వం ఆదేశించింది.
