ఇస్త్రీపెట్టెలో బంగారం అక్రమ రవాణా

V. Sai Krishna Reddy
1 Min Read

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుండి రూ. 1.55 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారం గురించి అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.                       వివరాల్లోకి వెళితే, షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు పరిశీలించగా, ఒక ఐరన్ బాక్సులో దాచి ఉంచిన 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన కీలక సంబంధాలు వెలుగుచూశాయి.

నిన్న రాత్రి ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన డీఆర్‌ఐ అధికారులు, అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *