హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు.. టాలీవుడ్‌లోకి మహేశ్ బాబు మేనకోడలు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నటశేఖర కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్ బాబు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ఆయన కుమార్తె మంజుల-సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వి స్వరూప్ ఘట్టమనేని హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త వెలువడింది.

మహేశ్ బాబు మేనకోడలైన జాన్వి స్వరూప్, త్వరలోనే ఓ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నటి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఆమె ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు టాప్, ఆకుపచ్చ ప్యాంట్‌తో ఉన్న ఫొటోలో జాన్వి లుక్ ఫ్రెష్‌గా, ఆకట్టుకునేలా ఉంది.

నిజానికి జాన్వికి నటన కొత్తేమీ కాదు. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వి ఓ చిన్న పాత్రలో కనిపించారు. అయితే, ఈసారి పూర్తిస్థాయి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాత, మామయ్యల బాటలో నటిగా రాణించాలని వస్తున్న జాన్వి తొలి సినిమా వివరాలు, దర్శకుడు, హీరో వంటి ఇతర విశేషాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *