హనుమాన్ చాలీసా పారాయణం
— విశ్వహిందూ పరిషత్
రామారెడ్డి సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)
రథాల గైన్ దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ కమిటీ సభ్యుల ద్వారా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
శరన్నవరాత్రుల సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలో దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్న క్రమంలో రథాల గైన్ దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని చాటి చెప్పడానికి దుర్గామాత వద్ద సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు.ఈ యొక్క సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మాతృ శక్తి, దుర్గా వాహిని కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు, భక్తులు,పాల్గొనడం జరిగింది.ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో ఘనంగా జరపాలంటూ ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
