రాజకీయ వేదికలపై భిన్న సిద్ధాంతాలతో ప్రయాణిస్తున్నప్పటికీ, వారి మధ్య ఉన్న సోదరానుబంధం ఎంతో ప్రత్యేకం. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తన సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు రాఖీ కట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఈ అపురూప ఘట్టం వారిద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.
రక్షాబంధన్ సందర్భంగా పురందేశ్వరి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన రక్షాబంధన్. నా తమ్ముడి చేతికి రాఖీ కట్టి, అతను సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని, అతని కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను” అని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలోని ప్రతి దశలోనూ సోదరులు తనకు రక్షణ కవచంలా, మంచి స్నేహితుల్లా నిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు.
మీరందరూ మంచి ఆరోగ్యంతో, మీ కలలను సాకారం చేసుకునే శక్తితో, ప్రతి అడుగులోనూ అపారమైన శ్రేయస్సుతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మనం కలిసి పంచుకున్న ప్రతి జ్ఞాపకం నాకు అమూల్యమైనది. భవిష్యత్తులో కూడా మన బంధం ఇలాగే నవ్వులతో, ప్రేమతో కొనసాగాలని ఆశిస్తున్నాను” అని పురందేశ్వరి తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.