సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూన్ 30(ప్రజాజ్యోతి):ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కి పదవి విరమణ సహజమని ఉద్యోగితనుచేసిన సేవలు ప్రజలకు గుర్తు వున్నప్పుడే తను చేసిన సేవకు గుర్తింపు వుంటున్నది అని మున్సిపల్ కమీషనర్ సి.ఎచ్.హనుమంత రెడ్డి అన్నారు.సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ యెస్.కె.జానీమియా పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఇ.సత్యారావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల.శ్రీనివాస్,ఆర్వో కళ్యాణి, ఆర్.ఐ లు జాన్పటి నాగయ్య,ఏశబోయిన శ్రీను,యం.డి.గౌసుద్దీన్,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్,ఇండ్ల మనోజ్ కుమార్, యం.డీ.అజీముద్దీన్,బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది గోపారపు రాజు తదితరులు పాల్గొన్నారు.