బిఆర్ఎస్ పార్టీ శిలాఫలకం ధ్వంసం..?
అధికారుల నిర్లక్ష్యమా…?
— అయోమయం లో కార్యకర్తలు..?
రామారెడ్డి జూన్ 29 (ప్రజా జ్యోతి)
సదశివానగర్ మండల కేంద్రం లొ అధికారుల నిర్లక్ష్యం వల్లనే శిలా పలకం ధ్వంసం..? గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయల రోడ్లు పూర్తి చేసి ప్రారంభించిన శిలపలకాన్ని ధ్వంసం చేయడం పట్ల బారాస నాయకులు,బిఆర్ఎస్ కార్యకర్తలు మండల ప్రజలు మండిపడ్డారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివ నగర్ మండల కేంద్రంలో దంసమైన శిలాఫలకాన్ని పరిశీలించారు.అక్కడే ఉన్న షాపుల యజమానులను శిలాఫలకం ధ్వంసం ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ పనులు చేసేటప్పుడు రోడ్డు రోలర్ ఇటువైపు తిప్పడంతో శిలాఫలకం ధ్వంసం అయ్యింది అని సమాచారం.శిలాఫలకం ధ్వంసమై రెండు వారాలు గడుస్తున్నప్పటికిని సంబంధిత పంచాయతీరాజ్ డిఇ,ఏ ఈ పట్టించుకోకపోవడం పట్ల బిఆర్ఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వాలు అప్పటి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రోడ్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ప్రస్తుతం రోడ్డు పనులు చేస్తూ దంసమైందని అధికారులు తెలిపారు. వెంటనే మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, సదాశివ నగర్ మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, తో కలిసి సంబంధిత ఏఈ తో ఫోన్లో మాట్లాడారు.కనీసం దంసమైనా శిలాఫలకం పక్కకు తీయకపోవడం ఏంటని ప్రశ్నించారు.రోడ్ కాంట్రాక్టర్ పనులు చేసేటప్పుడు శిలాఫలకం ద్వాంసం అయ్యింది. వాస్తవమే అని త్వరలోనే దాన్ని నిర్మిస్తామని ఏ ఈ సురేష్ తెలిపారు. వారం రోజుల్లోగా శిలాఫలకం నిర్మించకపోతే బారాస ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ రైతు విభాగం ఉపాధ్యక్షుడు గాదారి అశోక్ రెడ్డి, మాజీ కొ అప్షన్ సభ్యులు అల్తాఫ్ నాయిని సాయన్న మాజీ బిఆర్ఎస్ అధ్యక్షుడు బాల్రెడ్డి,వంగిటి రమేష్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ డాకయ్య వార్డు మెంబర్ సంతోష్ రెడ్డి,సాకలి రాజయ్య,గణేష్ కొమ్ము సాయిలు, కోరి స్వామి రాజయ్య తదితరులు పాల్గొన్నారు