- మెదక్ కోర్టు భవనం పైనుంచి దూకి దంపతులు ఆత్మహత్యయత్నం
అక్కడికక్కడే దుర్మరణం చెందిన రమ్య
భర్త నవీన్ ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం
——————–
మెదక్ జూన్ 28: (ప్రజాజ్యోతి ) జిల్లా కేంద్రం మెదక్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోర్టుకు శనివారం కేసు ఇయరింగ్ కు వచ్చిన ఓ కుటుంబం కోర్టు భవనం పైనుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది . రమ్య నవీన్ దంపతులు పిల్లలతో కలిసి ఆత్మ హత్య కు పాల్పడగా రమ్య(30) అక్కడి కక్కడే మృతి చెందగా భర్త నవీన్ ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందన్నారు. గమనించిన స్థానికులు ముగ్గురినీ మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దౌల్తాబాదు చెందిన వారిగా గుర్తించారు.
రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నవీన్ ను గతంలో ప్రేమ వివాహం చేసుకుంది.గత ఏడాది నవీన్ అత్తగారి ఇంటిపై సుతిల్ బాంబు వేయడంతో అప్పట్లో రామాయంపేట పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.అప్పటి నుంచి భార్య భర్తల మధ్య నిత్యం గోడవలు జరుగుతు న్నాయి.కాగా అదే కేసు ఇయరింగ్ రావడంతో కోర్టు ప్రాంగణంలోనే గొడవ పడ్డ భార్యభర్తలు ఆత్మహత్యా యత్నానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.