అన్నదమ్ములపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

Warangal Bureau
1 Min Read

ఆత్మకూరు, జూన్ 28 (ప్రజాజ్యోతి)::

అన్నదమ్ములపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి శనివారం తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదమ్ములపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు గ్రామానికి చెందిన తనుగుల రాజును శనివారం తెల్లవారుజామున బరుపట్ల రాజు, అన్వేష్, శ్రవణ్ లు కలిసి దాడి చేశారు. దాడి విషయాన్ని తన సోదరుడు రఘుకు ఫోన్ చేసి చెప్పడంతో ఘటనా స్థలానికి రఘు వచ్చాడు. ‘మా అన్నను ఎవరు కొట్టారు..?’ అని రఘు ప్రశ్నించడంతో అతనిపైనా ఆ ముగ్గురు ఇనుప రాడ్డు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రఘును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *