పులిచింతల ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న తెలంగాణ విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది.పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యం 120 యూనిట్లు కాగా ఒక యూనిట్ నుండి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తన సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తుండడంతో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించినట్లు. విద్యుత్ ఉత్పాదన కోసం 2,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 24.0030 టీఎంసీలు గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 48.35 అడుగులకు చేరింది. మొత్తం అవుట్ ఫ్లో 2,000 గా ఉంది.