వైసీపీ అధినేత ఇప్పటికి 13 ఏళ్ళ క్రితం అరెస్ట్ అయి ఏకంగా పదహరు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. అప్పటికి ఆయన రాజకీయంగా యువ నేత. పెద్దగా జనాలకు తెలియని స్థితిలోనే ఆయనను తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్ వస్తుందని అనుకుంటే చాలా నెలలే జైలు గోడల మధ్య ఉండిపోవాల్సి వచ్చింది.
బహుశా అదే జగన్ ని రాటుదేలేలా చేసింది అని అంటారు. ఇక 2013 సెప్టెంబర్ లో విడుదల అయిన జగన్ నాటి నుంచి 12 ఏళ్ల పాటు బెయిల్ మీదనే ఉన్నారు. ఈ మధ్యలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా మళ్లీ విపక్ష నేతగా మారుతూ వచ్చారు. ఆయన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా మరోసారి జైలుకు వెళ్తారు అని అనుకుంటే వేరే కేసులతో ఆయన అరెస్టు అయి జైలుకు వెళ్తారా అన్న చర్చ వస్తోంది
జగన్ ని లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేస్తారు అని రెండు నెలల క్రితం దాకా పెద్దగా ప్రచారం జరిగింది. ఇక రేపో మాపో అన్నట్లుగా విపరీతంగా పుకార్లు షికారు చేశాయి. మొత్తానికి ఆ అలజడి అయితే తగ్గింది. ఇంతలో అనూహ్యంగా వేరే కేసులు జగన్ ని చుట్టుముడుతున్నాయి. జగన్ మీద తాజాగా ఏటూ నిందితుడుగా ఒక కేసు ఫైల్ అయింది. రెంటపాళ్ళకు వెళ్లే క్రమంలో జగన్ కారు కింద పడి ఒక వృద్ధుడు మరణించాడు అని రెండు రోజుల క్రితం పోలీసులు నిర్ధారించి జగన్ ని ఏటూ గా ఆ కేసులో చేర్చారు ఇక తాజాగా తాడేపల్లిలోని ఆయన ఆఫీసుకు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ కార్యాలయ ఇంచార్జ్ అప్పిరెడ్డి వాటిని తీసుకున్నారు.
బహుశా అదే జగన్ ని రాటుదేలేలా చేసింది అని అంటారు. ఇక 2013 సెప్టెంబర్ లో విడుదల అయిన జగన్ నాటి నుంచి 12 ఏళ్ల పాటు బెయిల్ మీదనే ఉన్నారు. ఈ మధ్యలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా మళ్లీ విపక్ష నేతగా మారుతూ వచ్చారు. ఆయన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా మరోసారి జైలుకు వెళ్తారు అని అనుకుంటే వేరే కేసులతో ఆయన అరెస్టు అయి జైలుకు వెళ్తారా అన్న చర్చ వస్తోంది. Also Read – టీడీపీ కంచుకోట మీదకు అంబటి జగన్ ని లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేస్తారు అని రెండు నెలల క్రితం దాకా పెద్దగా ప్రచారం జరిగింది. ఇక రేపో మాపో అన్నట్లుగా విపరీతంగా పుకార్లు షికారు చేశాయి. మొత్తానికి ఆ అలజడి అయితే తగ్గింది. ఇంతలో అనూహ్యంగా వేరే కేసులు జగన్ ని చుట్టుముడుతున్నాయి. జగన్ మీద తాజాగా ఏటూ నిందితుడుగా ఒక కేసు ఫైల్ అయింది. రెంటపాళ్ళకు వెళ్లే క్రమంలో జగన్ కారు కింద పడి ఒక వృద్ధుడు మరణించాడు అని రెండు రోజుల క్రితం పోలీసులు నిర్ధారించి జగన్ ని ఏటూ గా ఆ కేసులో చేర్చారు ఇక తాజాగా తాడేపల్లిలోని ఆయన ఆఫీసుకు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ కార్యాలయ ఇంచార్జ్ అప్పిరెడ్డి వాటిని తీసుకున్నారు. Also Read – యుద్ధాలతో సంబంధం లేని ప్రాంతాలు.. మూడోది వచ్చినా ఇక్కడ సేఫ్! ఇక విషయం చూస్తే జగన్ తాడేపల్లి దాకా వచ్చేసింది. పోలీసులు విచారణకు ఎపుడు పిలిస్తే అపుడు వెళ్లేందుకే ఈ నోటీసులు అని అంటున్నారు. జగన్ ని విచారణకు పిలిపించి అరెస్ట్ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు అంతటా వినిపిస్తున్న మాట. జగన్ ని జైలులో పెడితే అది ఆయనకు లాభమా లేక నష్టమా అన్నది కూడా హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. అయితే ఒక వృద్ధుడు తన కారు కింద పడినా జగన్ పర్యటన చేసుకుంటూ ముందుకు పోవడంతో ఆయనను అరెస్ట్ చేసినా సానుభూతి రాదు అని కూటమి వైపు నుంచి వినిపిస్తోంది
అయితే కావాలనే కక్షతోనే జగన్ ని అరెస్ట్ చేస్తే కనుక అది కూటమి సర్కార్ కి బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. జగన్ మళ్ళీ జైలుకు వెళ్తే కనుక అది వైసీపీకే తిరుగులేని సానుభూతిని తెస్తుందని పైగా జగన్ అరెస్టుతో కూటమి పట్ల వ్యతిరేకత మరింతగా పెరుగుతుందని వారు అంటున్నారు. ఇంతకీ జగన్ అరెస్టు అవుతారా ఆయనను జైలులో పెడతారా అంటే వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే కనుక ఏమో జరగవచ్చేమో అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.