మున్సిపల్ కమిషనర్ బదిలీ.. ఆయన స్థానం లో జి. శ్రీనివాస్

Nalgonda Bureau
1 Min Read

మున్సిపల్ కమిషనర్ బదిలీ.. ఆయన స్థానం లో జి. శ్రీనివాస్

 

మిర్యాలగూడ, జూన్ 24, ( ప్రజాజ్యోతి ):- మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టి కె శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 మంది కమిషనర్ల బదిలీల్లో భాగంగా ఈ బదిలీ జరిగింది. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జాయింట్ కమిషనర్ గా పని చేస్తున్న జి. శ్రీనివాస్ ను మిర్యాలగూడ కమీషనర్ గా బదిలీ చేశారు. యూసుఫ్ గత ఫిబ్రవరి 2024వరకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గా పని చేసి మిర్యాలగూడకు వచ్చారు. ప్రస్తుతం బదిలీపై వెళ్లిన యూసుఫ్ కు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. డైరెక్టర్ కు రిపోర్టు చేయనున్నట్టు తెలిసింది. బదిలీ అయిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎండీ. ఇలియాస్,బిజెపి నాయకుడు చిలుకూరు శ్యాం, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ రమేష్ నాయక్, ఎస్.ప్రవీణ్ లు ఆయనను శాలువాతో సన్మానించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *