అమెరికాలో భారత విద్యార్థులకు ఊరట

V. Sai Krishna Reddy
1 Min Read

2023లో 1,60,627 మందికి ఓపీటీ అవకాశాలను కంపెనీలు కల్పించగా.. 2024లో ఈ సంఖ్య 1,94,554 కు చేరింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీ.హెచ్.ఎస్.) తాజాగా విడుదల చేసిన స్టూడెంట్ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌.ఈ.వీ.ఐ.ఎస్‌) గణాంకాలు వెలువడ్డాయి. వాస్తవానికి మన దేశం నుంచి అత్యధికంగా తరలివెళ్లే ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఎక్కువమంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ / మ్యాథ్‌ మ్యాటిక్స్‌ (స్టెమ్‌) ఎంఎస్‌ కోర్సుల్లో చేరుతుంటారు. ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు, ఓపీటీ కింద తమ చదువుకు సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతి ఉంటుంది. ఇదే సమయంలో… స్టెమ్‌ కోర్సులు అభ్యసించిన వారు, స్టెమ్‌ ఓపీటీని రెండేళ్ల పాటు పొడిగించుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో.. స్టెమ్‌ ఓపీటీని పొడిగించుకునేందుకు అనుమతిపొందిన వారి సంఖ్య 20223లో 51,507గా ఉండగా.. 2024లో 54 శాతం పెరిగి వీరి సంఖ్య 95,384కి చేరింది. ఇక స్టెమ్‌ ఓపీటీ లభించిన వారి సంఖ్య 2024లో 1,65,524గా ఉంండగా.. ఇందులో 48% మంది భారతీయ విద్యార్థులే కావడం గమనార్హం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *