కల్తీ కల్లుకు ప్రోత్సహిస్తున్న ఆప్కారి శాఖ 

Kamareddy
1 Min Read

కల్తీ కల్లుకు ప్రోత్సహిస్తున్న ఆప్కారి శాఖ

నష్టపోతున్న నిజమైన కల్లు గీత కార్మికులు..

ప్రజా జ్యోతి ఆర్ సి బాన్సువాడ జూన్ 22

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మొగులాని పల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు విఠల్ గౌడ్ కు చెందిన కొత్తబాదికి సంబంధించినగౌడ సొసైటీ లో లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో విట్టల్ గౌడ్ కు మొగులాని పల్లి శివారులో ఆయన సొంత పొలంలో హరితహారం లో భాగంగా 500 ఈత చెట్లు ఇచ్చారని అదనంగా 7 00 ఈత చెట్లు ఆయన కొనుక్కున్నారని మొత్తము 1200 ఈత మొక్కలు నాటానని వాటికి సంరక్షిస్తూ 10 సంవత్సరాలుగా పెంచి పెద్ద చేసిన తర్వాత గీతకు వచ్చాయని టి ఎఫ్ టి ద్వారా, పివ్వర్ కల్లు , నీరా కట్టి అమ్ముకుందామంటే నాకు లైసెన్స్ ఇవ్వకుండా కొత్తబాది సొసైటీకి ఇస్తామని బాన్సువాడ ఎక్సైజ్ సీఐ అనడం గమనర్వం , సొసైటీ తరపున 3000 రూపాయలు ఇస్తారు తీసుకోమని చెపుతున్నారని నా పొలములోని ఈత చెట్లు వేరె వాళ్లకు అప్పనంగా కట్టబెట్టడం వెనకాల మతలబు ఏమిటి అని నా లాంటి అసలైన గీత్కర్మికులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *