బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపైకి ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం కేరళలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. త్రిసూర్ లోని చోవూర్ బస్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతుండడంతో గొడుగులతో నిల్చున్నారు. ఇంతలో ఓ బస్సు అటుగా వస్తూ అదుపుతప్పింది.
బస్టాప్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బస్సు మీదికి వస్తుండడంతో తప్పించుకునేందుకు ఆ మహిళలు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.