ప్రతి రోజూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

Kamareddy
1 Min Read

ప్రతి రోజూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

యోగ చేస్తున్న 5:30 బ్యాచ్

రామారెడ్డి జూన్ 21(ప్రజా జ్యోతి)

ప్రతి రోజూ ఉదయం యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, స్థానిక యువకులు 5:30 బ్యాచ్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని పాఠశాల గ్రౌండ్ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా ఆసనాలు, దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2015 జూన్ 21 న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే ఒరవడి కొనసాగు తోందన్నారు. యోగా సాధన చేయడం ద్వారా నయం కానటువంటి రోగాలు సైతం తగ్గిపోతాయని అన్నారు. ఉద్యోగులు పని ఒత్తిడి కి గురైయ్యే వారు యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు, ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు.యోగా చేయిస్తూ…యోగా పద్దతులను వివరిస్తూ, వివిధ యోగాసనాలను యోగ సాధనకు వచ్చిన వారిచే చేయించి యోగా ప్రాధాన్యత, యోగా శాస్త్రానికి 5 వేల సంవత్సరాల చరత్ర ఉందని వివరించారు. మానసిక ఒత్తిడి జయించడానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుంది.తెలిపారు ఈ కార్యక్రమంలో 5:30 బ్యాచ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *