సెమ్స్ ఒలంపియాడ్ పరీక్ష లో శిశుమందిర్ విద్యార్థుల ప్రభంజనం
- పరిగి, జూన్ 20 (ప్రజాజ్యోతి) :
స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్ పరిగి పాఠశాల విద్యార్థులు సెమ్స్ ఒలంపియాడ్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. పాఠశాలకు చెందిన ఆర్. రుత్విక్ స్టేట్ 3వ ర్యాంకు సాధించడంతో పాటు జి. పావని జోనల్ ర్యాంకు 5వ, ర్యాంకు, యు. సాయి రక్షిత జోనల్ ర్యాంకు 14వ, కె. సహస్ర జోనల్ ర్యాంకు 14వ, సీహెచ్, ఖ్యాతి శ్రీ 17వ ర్యాంకు సాధించారని ప్రధానాచార్యులు మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు రాచూరి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను అభినందించి స్టేట్ ర్యాంకు సాధించిన ఆర్. రుత్విక్ కు 1000 రూపాయాల నగదును బహుమతిగా అందజేశారు. ఇలాంటి ర్యాంకులు మరిన్ని సాధించాలని విద్యార్థులను ఆచార్యులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆచార్య మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.