దౌర్జన్యంగా ప్రభుత్వ వైద్యాధికారిపై దాడి

Kamareddy
1 Min Read

దౌర్జన్యంగా ప్రభుత్వ వైద్యాధికారిపై దాడి

* ధర్నా నిర్వయించిన వైద్య సిబ్బంది….!

రామారెడ్డి మండలం జూన్19 (ప్రజా జ్యోతి)

ఈనెల 17 వ తేదీన రాత్రి సుమారు 8:45 సమయంలో కామారెడ్డి కల్కినగర్ లో నివాసం ఉంటున్న రామారెడ్డి వైద్యాధికారి డా.సురేష్ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా దాడి చేసిన దేవునిపల్లి పిహెచ్ సి డీఈఓ రాజు (మాజీ రామారెడ్డిఉద్యోగస్తుడూ)అదేవిధంగా జుక్కల్ ప్రభుత్వ హాస్పిటల్ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే సుభాష్ వీరు ఇద్దరు అసభ్యకర పదాలతో, వ్యక్తిగత కారణాలతో, లేనిపోని అపనిందలు డాక్టర్ పై మోపి,దాడి చేశారు.ఈ యొక్క దాడి లో డాక్టర్ కి స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఈ యొక్క దాడిని ఏకధాటిగా రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది అందరూ ఖండిస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు, పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్ స్పందించి, దాడి చేసిన ఇద్దరిపై కట్టిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుతున్నాం. వీరి ఇద్దరి పై చర్యలు తీసుకొని యెడల జిల్లావ్యాప్తంగా అందరం ధర్నాలు చేస్తూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బందిని ఏకాదాటి పై తీసుకువచ్చి,న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయటం జరుగుతుందని మునుముందు వైద్య సిబ్బంది కి ఎలాంటి ఇబ్బంది. కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, వారిపై చర్యలు తీసుకొని యెడల మునుముందు ధర్నాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క ధర్నాలో రామారెడ్డి సిబ్బంది తో పాటు అన్నారం పభుత్వ వైద్య సిబ్బంది. రాజంపేట ప్రభుత్వ వైద్య,బిక్కనూర్ వైద్య సిబ్బంది.కామారెడ్డి అర్బన్ వైద్య సిబ్బంది. పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *