కాంగ్రెస్ పాలనలో రైతులకు జైలు బేడీలు తప్పడం లేదు – రాబోయే ఎన్నికలలో ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పదు.

Vikarabad Staff Reporter
2 Min Read

కాంగ్రెస్ పాలనలో రైతులకు జైలు బేడీలు తప్పడం లేదు
– రాబోయే ఎన్నికలలో ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పద
– కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ వద్దంటే రైతులపై రాక్షసత్వం చూపిస్తున్నారు
– ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే దేశద్రోహి టెర్రరిస్ట్ గా చూస్తున్నారు
– వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ ప్రతినిధి, జూన్ 18(ప్రజా జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు బీడీలు, జైలు జీవితం తప్పడం లేదని వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివారులో నిర్మించతలపెట్టిన ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం ఆయా గ్రామ ప్రజల అనారోగ్యానికి మూలం అని ఆ గ్రామాల ప్రజలు భవిష్యత్ లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలిసి వస్తుందనే భయంతో.. ఫ్యాక్టరీ వద్దు అని నిరసన చేసినందుకు గాను రైతులపై ఘోరంగా లాఠీ చార్జి జరిపి, పదుల సంఖ్యలో అమాయక రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తాజాగా వారి రిమాండ్ ముగియడంతో ఆలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు గాను రైతుల చేతులకు సంకెళ్లు వేసి మరి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వంలో ఒక సామాన్య రైతు తన భూమి కోసం, ఆరోగ్యం కోసం, వారి పిల్లల భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నందుకు జైలు, బేడీలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు దిగిన రైతులపై ప్రభుత్వం అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు తరలించడం అమానుషమని రాబోయే ఎన్నికలలో ప్రజా వ్యతిరేకత తప్పదని అన్నారు.
ప్రభుత్వం తీరుని తప్పుపడితే చాలు.. వాళ్ళని అరెస్టు చేస్తున్నారని, రేవంత్ ప్రభుత్వం రైతును ఒక దేశద్రోహిని, టెర్రరిస్టును చూసినట్టు చూస్తోందని విమర్శించారు.
ల‌గ‌చ‌ర్ల రైతుల‌కు బేడీలు వేసిన‌ట్టే.. ఇక్కడి రైతుల‌కు కూడా సంకెళ్లు వేసి రైత‌న్న‌ల ప‌ట్ల రేవంత్ స‌ర్కార్ క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తుందన్నారు. గతంలో ల‌గ‌చ‌ర్ల రైతు హీర్యా నాయక్ తీవ్ర ఛాతి నొప్పితో బాధపడుతుంటే.. చికిత్స కోసం ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లారు.
ప్రభుత్వం, పోలీసులు రైతుల పట్ల ఇకనైనా తమ తీరును మార్చుకోవాలని అన్నారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశపూర్వక రాక్షసత్వం నిర్లక్ష్యం
ఇప్పటికైనా మానుకొని వారికి మంచి చేయడంపైన దృష్టి పెడితే బాగుంటుందని ప్రధాన ప్రతిపక్షంగా, వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా హితవు పలకడం జరుగుతుందన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *