మెజారిటీ పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు కాకుండా.. కొన్ని వ్యవస్థలకు, మరికొన్ని సంఘాలకు, కొందరు వ్యక్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయనేది జగమెరిగిన సత్యం అని అంటారు! ఈ క్రమంలో తాజాగా పర్యాటకులు దోపిడీకి గురవుతున్న విషయంలో గోవా సర్కార్ తీసుకున్న నిర్ణయం, మొండి మద్దతు చర్చనీయాంశంగా మారింది.
అవును… భారతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఇష్టమైన హాలిడే స్పాట్ లో గోవా ఒకటనే సంగతి తెలిసిందే. ప్రధానంగా వేసవి సీజన్ లోనూ, వర్షాకాలపు సీజన్ ప్రారంభంలోనూ ఇక్కడ భారీ రద్దీ ఉంటుంది. ఇక్కడున్న బీచ్ లు, నిర్మాణ శైలికి ప్రత్యేకంగా ఉంటాయి.. పర్యాటకు తప్పక సందర్శించడమే కాకుండా.. పదే పదే సందర్శించేవిగా ఉంటాయి
అలాంటి గోవాలో ఇటీవల కాలంలో ఓ పెద్ద సమస్య తెరపైకి వచ్చింది. దేశ ఇదేశాల నుంచి ఇక్కడకి వచ్చే పర్యాటకులు దోపిడీకి గురవుతున్నారు. స్థానికంగా అవగాహన లేకపోవడం ఒకెత్తు అయితే, మరో ఆప్షన్ లేకుండా చేయబడటం మరొకెత్తని అంటున్నారు. దానికి కారణం టక్సీలు.. సిండికేట్ గా మారిన హోటళ్లు, రిసార్ట్లు, టూర్ గైడ్లు అని చెబుతున్నారు. వాస్తవానికి గోవా విమానశ్రయం నుంచి హాలిడే స్పాట్స్ కి వెళ్లడానికి హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి సిటీలోని ఏ ప్రాంతానికి అయినా ఉండేటంత దూరమే ఉంటుంది. అలా అని హైదరాబాద్ లో ఉన్న టాక్సీ, క్యాబ్ రేట్లు అక్కడ ఉండవు. అవి దాదాపు రెట్టింపుగా ఉంటాయి. దీనిపై ప్రశ్నించినా ఫలితం ఉండకుండా ఉంది పరిస్థితి.
ఈ నేపథ్యంలో పర్యాటకులకు కాస్త న్యాయం చేసేందుకు, దోపిడీని అడ్డుకునేందుకు ఉబర్, ఓలా మొదలైన టాక్సీ సర్వీసులు రంగంలోకి దిగుతున్నప్పటికీ… గోవాలో మాత్రం క్యాబ్ సర్వీసులు నిషేధించాలని స్థానిక టాక్సీ డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. దీంతో.. పర్యాటకుడి మోసపోవడం అనివార్యమవుతోంది. దీంతో… ఈ దోపిడీ నుంచి ఉపశమనం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. గోవాలో కూడా అన్ని నగరాల్లో లాగానే ఉబర్, ఓలా క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తేవాలని, దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు దోపిడీకి గురవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు