కాలభైరవ స్వామి పలహారములు ప్రసాదముల వేలం పాట నిర్వహణ

Kamareddy
1 Min Read

కాలభైరవ స్వామి పలహారములు ప్రసాదముల వేలం పాట నిర్వహణ

— వేలం పాట పొందిన పటేండ్ల భాస్కర్ రెడ్డి

రామారెడ్డి జూన్ 13 (ప్రజాజ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి, రామారెడ్డి, మండల కేంద్రంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో శుక్రవారం దేవస్థానం యొక్క ఫలహారంలు, ప్రసాదములు ఉదయం 11 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలపురాలు కమల నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించినైనది. ఈ యొక్క వేలం నందు ఆరుగురు డిపాజిట్లు వేలంపాడగా, హెచ్చుపాటదారుగా పటేండ్ల భాస్కర్ రెడ్డి, తండ్రి సంజీవరెడ్డి రామారెడ్డి వాస్తవ్యులు ఒక సంవత్సరమునకు గాను 6,99,000/-వేలకు వేలం పాట దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలపురాలు కమల, ఆలయ ఈవో ప్రభు గుప్తా, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ , ఆలయ సహాయకులు నాగరాజు,భరత్, డిపాజిట్ దారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *