కాల్ మెర్జింగ్ స్కామ్ : మీ డబ్బులన్నీ మాయం

V. Sai Krishna Reddy
2 Min Read

కాల్ మర్జింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది? ఈ మోసం చాలా సూటిగా, తెలివిగా సాగుతుంది. మీరు గుర్తించని నంబర్ నుండి ఓ కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే ముందు వ్యక్తి మాట్లాడతాడు ‘‘మీ స్నేహితుడు నా గురించి చెప్పాడు, మీతో ముఖ్యమైన విషయముంది’’ అని. మీరు ఆ మాటలు వింటుండగానే మరో మిస్డ్ కాల్ మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. “ఇదిగో మీ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు.. ఇద్దరమూ కలిసి మాట్లాడదాం” అంటూ మొదటి వ్యక్తి కలిపేలా (Merge Call) చేయమని సూచిస్తాడు. మీరు Merge Call చేస్తే అంతే… ప్రమాదం మొదలైంది.
మీ ఫోన్ నెట్‌వర్క్ ద్వారా వచ్చే OTP (One Time Password)ని సౌండ్ ద్వారా చదివే విధంగా బ్యాంక్ లేదా డిజిటల్ వాలెట్ సేవలు కొన్ని ఉంటాయి. మీరు Merge చేసిన కారణంగా ఆ OTPని ఆ స్కామర్ వినగలుగుతాడు. ఆ OTP ద్వారా అతను ఏదైనా డిజిటల్ లావాదేవీని పూర్తిచేసి మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని తీసుకునే అవకాశం పొందుతాడు. ఇది పూర్తిగా ప్లాన్ చేసిన దాడి. ముందుగానే స్కామర్ మీ బ్యాంక్ లేదా వాలెట్ వివరాలను సేకరించి ఉంటాడు. మీరు కాల్ మర్జ్ చేసే సమయంలో అతను ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ప్రారంభించి, OTP కోసం వేచివుంటాడు. OTP విన్న వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ చేయబడుతుంది.

ఇలాంటి మోసాల నుండి ఎలా కాపాడుకోవాలి? *గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ ఎత్తవద్దు. *డిజిటల్ పేమెంట్స్ (PhonePe, Google Pay, Paytm, etc) లేదా మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు ఎక్కువగా జాగ్రత్త పడాలి. *ఎప్పటికీ Call Merge చేయవద్దు, ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల విషయంలో. *OTPలను ఫోన్ కాల్స్ ద్వారా చెప్పవద్దు. అవి చదివే కాల్స్ కి జాగ్రత్త. *Bank లేదా App Notifications ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఒక్క చిన్న కాల్ మీ జీతాన్ని, పొదుపును మొత్తం ఖాళీ చేయగలదన్న విషయాన్ని మరిచిపోకండి. ఏ ఒక్క అడుగూ వేయడానికి ముందు రెండుసార్లు ఆలోచించండి. అప్రమత్తంగా ఉండండి, మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *