సర్వదేవతల సమ్మేళనం.. బొడ్రాయి సంబురం రాజన్నగూడెంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

V. Sai Krishna Reddy
2 Min Read

సర్వదేవతల సమ్మేళనం.. బొడ్రాయి సంబురం

రాజన్నగూడెంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

నిడమానూరు, జూన్06 (ప్రజా జ్యోతి )ఃభిన్న సం స్కృతులకు నిలయం తెలంగాణ.. ఇక్కడ ఆచారాలు, సం ప్రదాయలూ ప్రత్యేకం. సర్వమత సమ్మేళనాల మరిమళానికి నిలువుటద్ధం. ప్రజల బాగోగులు, ఆపదల నుంచి కాపాడేందుకు ప్రతిపల్లెలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయిని ప్రతిష్ఠాంపజేస్తారు. దుష్టశక్తు లు, ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి అని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే బొడ్రాయి పునఃప్రతిష్ఠాపనకు రాజన్నగూడెం గ్రామం వేదికైంది .అన్ని కులాలు కలిసి చేసుకునే ఒకేఒక్క పండుగ బొడ్రాయి పండుగ జూన్ 06-జూన్ 08వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మండలి పుల్లయ్య ,రామకృష్ణ లు తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 06 నుంచి 08న విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం గ్రామంలో మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వత్మిక శ్రీ శీతల దుర్గా పరమేశ్వరి, నాభిశిల (బొడ్డురాయి), ఆదిత్యాది నవగ్రహ, దాసాంజనేయ, ముత్యాల పరమేశ్వరి, కోటమైసమ్మ, ఈదమ్మఅమ్మవార్ల , శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల విమాన కలశ, సుదర్శన చక్ర పునఃప్రతిష్టాన కార్యక్రమం మారావర్ణుల శ్రీనివాస శర్మ, మోహన శర్మ , ప్రతిష్టాయజ్జీక బ్రహ్మ , కొంకపాక రాధాకృష్ణమూర్తి- సీతాకుమారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే కార్యక్రమాలకు చలువ పందిళ్లు, హెూమ గుండాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు కన్నుల పండువగా నిర్వహించేందుకు నిర్వాహకులు అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేయగా శుక్రవారం  ఉత్సవాలు కొనసాగాయి. రాజన్నగూడెం గ్రామాల ప్రజలు సంయుక్తంగా మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వత్మిక శ్రీ శీతల దుర్గా పరమేశ్వరి, నాభిశిల (బొడ్డురాయి), ఆదిత్యాది నవగ్రహ, దాసాంజనేయ, ముత్యాల పరమేశ్వరి, కోటమైసమ్మ, ఈదమ్మఅమ్మవార్ల , శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల విమాన కలశ, సుదర్శన చక్ర పునఃప్రతిష్టాన కార్యక్రమం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు సుమారు 35 సంవత్సరాల క్రితం విగ్రహాల ఉండడంతో యధాస్థానంలో శిలా విగ్రహాలను, బొడ్రాయి తిరిగి పునః ప్రతిష్టించడం జరుగుతుందన్నారు.  మొదటి వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, మాతృకాపూజనం, పంచగవ్యప్రాశనం, దీక్షాధారణ, ఋత్విగరణం, రక్షాబంధం, యాగశాల ప్రవేశం, జపానుష్టానముల, చండీ పారాయణలు, యాగశాల పరివార దేవతా అవాహనం, షోడశ స్తంభపూజ, అఖండ స్థాపన, మంగళ నీరాజనం, తీర్థప్రసాద వినియోగములు.అదేవిధంగా‌ సాయంత్రం 4-00 గంటలకు వాస్తు మండపారాధన, క్షేత్రపాలక నవగ్రహ చతుషష్ఠి యోగిని, సర్వతోభద్ర మంటపారాధనలు, ప్రధాన కలశ స్థాపనలు, మృత్సంగ్రహణం, అంకురార్పణ దేవతావాహనం వాస్తు హోమం, పర్యగ్నీకరణము, రాత్రి 7-30 నిలకు నీరాజన మంత్రపుష్పములు, తీర్ధప్రసాద వినియోగదారులు చేపట్టారు.
ఈకార్యక్రమంలో గ్రామస్థులు,ప్రజలు, భక్తులు,తదితరులు, పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *