ఇసుక దందాలో హస్తం నేతలు… ఎమ్మెల్యేలకు తలనొప్పిన క్యాడర్ వ్యవహారం… ఆ ముగ్గురికి కిరికిరీ… అగని అక్రమ ఇసుక రవాణా రాత్రుల్లో డంపింగ్… పగలు తరలింపు…

Nizamabad Bureau Sanjeev Yedla

ఇసుక దందాలో హస్తం నేతలు

ఎమ్మెల్యేలకు తలనొప్పిన క్యాడర్ వ్యవహారం

ఆ ముగ్గురికి కిరికిరీ

అగని అక్రమ ఇసుక రవాణా

రాత్రుల్లో డంపింగ్… పగలు తరలింపు…

(నిజామాబాద్ బ్యూరో – ప్రజాజ్యోతి – ఎడ్ల సంజీవ్)

అధికారం మనదైతే అక్రమం ఏదైనా సక్రమమే అవుతుంది. అనుమతులు లేకున్నా రాత్రుల్లో మాత్రం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేలే అండదండలు ఉండగా, మరికొన్ని చోట్ల అభివృద్ధి పనుల పేరుతో అనుమతి తీసుకోని, అదే పేరుతో అడ్డదారిల్లో తరలిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక దందా చెయ్యొద్దని చెప్పినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అధికారులు మాత్రం అటు సీఎం మాట అమలు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడితో అధికారులు తలోగ్గాక తప్పడం లేదనే చెప్పాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాల్లో ఇసుక దందా జోరుగా సాగుతుంది.
హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఈ దందాను అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇదంతా ముగ్గురు ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరికొంత దందా చేస్తున్నారు. మంజీరా పరివాహాక ప్రాంతంలో క్వారీల్లో తవ్వకాలకు అనుమతులు నిలిపివేసినా దొంగ చాటున పొరుగు రాష్ట్రాలకు, హైదరాబాద్ కు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. స్ధానిక అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని వందల లారీల్లో ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. రాత్రంతా డంపింగ్ చేసి పగలు తరలిస్తున్నారు.

జుక్కల్ లో…

జుక్కల్ నియోజకవర్గంలో అధికారిక క్వారీలను స్ధానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు ఫిర్యాదుతో గతంలో మూసి వేశారు. ప్రస్తుతం ఆయన అనుచరులు దొంగ చాటున ట్రాక్టర్లలో తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి.. రాత్రి వేల్ల్లో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారనే ప్రచారం ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే సైతం విషయం బయటకు పొక్కకుండా పని కానివ్వాలని చేపుతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.

బాన్సువాడలో…

బాన్సువాడలోను అక్రమ ఇసుక రవాణా స్దానిక ఎమ్మెల్యే పోచారంకు తలనొప్పిగా మారింది. అభివృద్ది పనుల పేరు యువ నేత ముఖ్య అనుచరులు బీర్కూర్ క్వారీలో రాత్రి వేలల్లో తవ్వకాలు చేస్తున్నారు. లోకల్ లోనే కాకుండా పక్కనే ఉన్న ఇతర రాష్ట్రాలకు ఇసుకను పంపుతున్నారు. ఎమ్మెల్యే పోచారం పేరు చెప్పి ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు ఆయన అనుచరులు. బిఆర్ఎస్ హయం నుంచి ఇక్కడ అలవాటుగమారిన దందా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. పరోక్షంగా అధినేత సైతం సై అన్నట్లు చెపుతున్నారు. అవును మరి రాజు తలచుకుంటే కోరడ దెబ్బలు కరువా అన్నట్లు ఉంది.

బోధన్ లో…

ఇక బోధన్ లోనూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అనచురులు ఇసుక దందాలో రెచ్చిపోతున్నారు. మూడు పాయింట్లలో స్దానిక అవసరాల పేరిట తవ్వకాలు చేస్తుండగా వీటిపై ఫిర్యాదులు వచ్చాయి. విమర్శలు రావడంతో ప్రస్తుతం తవ్వకాలను నిలిపి వేసేలా సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇసుక దందాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం చర్చానీయాంశంగా మారింది.

ఆ నేతలదే హవా…

మూడు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే ఇసుక వ్యాపారుల అవతారం ఎత్తారు. ఎమ్మెల్యేల కంట్లో నలుసుగా మారారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ దందా నడుస్తుందా.? లేదా.? అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. ఇప్పటికే ప్రభుత్వ నిఘా విభాగాలు ఈ అక్రమాలపై నిఘా వేసి విచారణ చేస్తున్నారు. అయితే ఏ విచారణ జరిగిన తమ నేత (ఎమ్మెల్యే ) ఉన్నాడనే ధైర్యంతోనే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నామని బహిరంగగానే చెప్పడం గమనార్హం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *