సిబిఎస్ఈ లేకున్నా ఉన్నట్లూ ప్రచారం… చదువుల చిత్రాలు… వసూళ్ల బాగోతాలు… సిబిఎస్ఈ పేరుతో అక్రమంగా ఫీజుల వసూళ్ళు… “నిశిత”గా చూస్తేనే నిజాలు వెలుగులోకి… “శ్రీ చైతన్య”నాది అదే దారి కళ్ళు చెవులు మూసుకున్న విద్యశాఖ

Nizamabad Bureau Sanjeev Yedla

సిబిఎస్ఈ లేకున్నా ఉన్నట్లూ

చదువుల చిత్రాలు… వసూళ్ల బాగోతాలు…

సిబిఎస్ఈ పేరుతో అక్రమంగా ఫీజుల వసూళ్ళు

“నిశిత”గా చూస్తేనే నిజాలు వెలుగులోకి

“శ్రీ చైతన్య”నాది అదే దారి

కళ్ళు చెవులు మూసుకున్న విద్యశాఖ

(నిజామాబాద్ బ్యూరో – ప్రజాజ్యోతి ప్రతినిధి – ఎడ్ల సంజీవ్)

“నిశిత”ముగా మోసం…

ప్రజాజ్యోతి : సారూ… మా బాబు ఆరవ తరగతి. మీ స్కూల్ లో జాయిన్ చేయాలి. ఫీజు ఎంత.?
నిశిత కరస్పండెంట్ : ఆరవ తరగతికి రూ. 70 వేలు మాత్రమే. మీరు స్కూల్ కు వస్తే అన్ని వివరంగా చెబుతాం.
ప్రజాజ్యోతి : సారూ… సిలబస్ ఎలా ఉంటది సారు.
కారస్పండెంట్ : సిబిఎస్ఈ సిలబస్. ఇది సెంట్రల్ సిలబస్. టెన్త్ వరకు అన్ని విధాలుగా సిద్ధం చేస్తాం.
ఇది నిశిత ఇంటరనేషనల్ స్కూల్ అధికారి ఇచ్చిన సమాధానం. నిజానికి ఈ స్కూల్ కు సిబిఎస్ఈ అనుమతి లేదు. కానీ దర్జాగా కరపత్రం వేసి మరి పంపిణి చేస్తున్నారు. దీనిపై ఫోన్ లో “ప్రజాజ్యోతి” ప్రతినిధి వివరణ కోరగా అనుమతి ఉందని చెప్పి సిబిఎస్ఈకి దరఖాస్తు చేసుకున్న లేఖను సగం వరకు కట్ చేసి వాట్సాప్ కు పంపారు. రిపోర్టర్ అని తెలియగానే అది కూడా డిలీట్ చేశారు. ఇది “నిశిత”ముగా పరిశీలిస్తే బయట పడిన నిశిత ఇంటరనేషనల్ స్కూల్ బాగోతం. ఈ భాగోతంపై విద్యార్థి సంఘాలు జిల్లా అధికారులుకు ఫిర్యాదు చేసారు.

“శ్రీ చైతన్య” లేని సిలబస్

నిజామాబాద్ బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ ను “ప్రజాజ్యోతి ప్రతినిధి” వెళ్ళాడు. కరపత్రం చేతిలో పెట్టి ఈ సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ తో ప్రారంభిస్తున్నాం. నిజామాబాద్, బాన్సువాడలో ఉంది అని చెప్పారు. ఫీజుల వివరాలు పేపర్ మీద రాసి ఇచ్చారు. కానీ విద్యార్ధి సంఘాల ఆందోళనతో బాన్సువాడ లోని స్కూల్ వివాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న చైతన్య స్కూల్ కు ఈ ఏడాది సిబిఎస్ఈ అనుమతి రావడం గగనమే అని చెబుతున్నారు.

లక్షల్లో ఫీజుల వసూళ్ళు…

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సిబిఎస్ఈ సిలబస్ పేరుతో విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిశిత ఇంటరనేషనల్ స్కూల్, శ్రీ చైతన్య, హెచ్పీఎస్, నారాయణ స్కూల్స్ కి అనుమతులు లేకున్నా సిబిఎస్ఈ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించడమే కాకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా విద్యాశాఖ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. ఈ గోల అంతా ఎందుకు అనేనా మీ అనుమానం.? అవును విషయం ఏమిటంటే కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు లేపి రంగుల బంగుళాలు కట్టి ఆ అప్పులను కట్టెందుకు, లాభాలు దండుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు సిబిఎస్ఈ పేరు చెప్పి లక్షల రూపాయలు వసూల్ చేస్తున్నారు. ఇది అసలు సంగతి. ఇంతకు అది ఎవరు అనే కదా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అమ్మ వెంచర్ లో ఉన్న నిశిత ఇంటరనేషనల్ స్కూల్, కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్, చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో ఉన్న హెచ్పీఎస్ స్కూల్ ల తంతు ఇది. సాధారణ స్కూల్ పేరుతో పెద్ద మొత్తంలో ఫిజులు వసూల్ చేయడం కాకపోవడంతో ఏకంగా అనుమతులు లేకున్నా సిబిఎస్ఈ పేరుతో వసూళ్ళు చేస్తున్నారు.

అనుమతులు ఉన్న స్కూల్ ఇవే…

సిబిఎస్ఈ అనుమతులు ఉన్న పాఠశాలలు ఇవి ఎస్ఎస్ఆర్ నిజామాబాద్, జన్నేపల్లిలో, దాస్ నగర్ లోని నవ్య భారతి (ఎన్జీఎస్), అర్సపల్లిలోని నాలెడ్జ్ పార్క్, వినాయక నగర్ లోని ప్రెసిడెన్సీ స్కూల్. ఆర్మూర్ లోని క్షత్రియ, సేయింట్ అన్యానస్. కామారెడ్డి లోని ప్రొబేల్స్ స్కూల్స్ కు మాత్రమే అనుమతి ఉంది.

విద్యాశాఖలో వసూళ్ల పర్వం

సిబిఎస్ఈ సిలబస్ పై విద్యాశాఖ లో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. విద్యార్ధి సంఘాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుంది. వాస్తవానికి సంబంధిత స్కూల్ లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు అలాంటి కదలికలు కనిపించడం లేదు. దింతో నెలసరి మామూళ్ళపై ఆశతోనే స్కూల్ లపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *