ఇక్కడంత గోప్యం…
నోటీసులపై చర్యలు శూన్యమేనా.?
జీజీహెచ్ లో డైట్ కాంట్రాక్ట్ పై అన్ని అనుమానాలే.?
నిర్వహణపై ఫిర్యాదులు
విజిలెన్స్ విచారణతో నోటీసులు జారీ చేసిన అధికారులు
జిల్లా కలెక్టర్ పైనే ఆశలు
(నిజామాబాద్ బ్యూరో – ఎడ్ల సంజీవ్ – ప్రజాజ్యోతి )
నిజామాబాద్ జీజీహెచ్ లో డైట్ నిర్వహణ అది నుంచే వివాదాస్పదంగా మారింది. అసలు కాంట్రాక్టర్ కాకుండా అదే పేరుతో వేరే వ్యక్తి నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కలు తేల్చడం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. ఇదిలా ఉంటే డైట్ నిర్వహణ సక్రమంగా లేదని ఉన్నంతధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫలితంగా ఇటీవల డైట్ నిర్వహణపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసారు. ఇందులో అసలు లోగుట్టును ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఫలితంగా నోటీసులు జారీ అయ్యాయి.
ఏం జరిగింది…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) రోజుకు వేలమంది రోగులు వస్తున్నారు. ఇన్ పెషేంట్లుగా వందల మంది చేరుతున్నారు. వీరి కోసం అలాగే హాస్టల్, సిబ్బంది కోసం భోజన సౌకర్యం కోసం టెండర్లు నిర్వహిస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు భోజన వసతి ఏర్పాటు చేయాలి. ఇది జిజిహేచ్ లో భోజనం అందుతున్న తీరు. అయితే నిజామాబాదు జిజిహేచ్ లో భోజనం ఏర్పాటులో నిర్లక్ష్యం, క్వాలిటీ మెయింటెన్స్, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దింతో డిఏంఈ నరేంద్ర కుమార్ షాకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ షాకాజ్ నోటీసులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ సమాధానం పంపడమే కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. అలాగే కాంట్రాక్టర్ ను తొలగించినట్లు అయితే వెంటనే కొత్త కాంట్రాక్టర్ ను నియమించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
గోప్యం ఖరీదేంత.?
నిజామాబాద్ జీజీహెచ్ లో డైట్ నిర్వహణపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కానీ చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమిటీ అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే ఎక్కడ డైట్ నిర్వహణ పై లెక్కకు మించిన ఆరోపణ లు ఉండటం గమనార్హం. 2016 నుంచి ఇప్పటి వరకు ఎం/ఎస్. వై. శ్రీనివాస్ డైట్ కాంట్రాక్టర్ కు మాత్రమే కాంట్రాక్ట్ దక్కుతుంది. 2016 లో ముగ్గురు, 2019 లో ముగ్గురు, 2022 లో అయిదుగురు, 2024 లో 11 మంది టెండర్లు వేసిన ఒకే ఒక ఎం/ఎస్. వై. శ్రీనివాస్ కు మాత్రమే కాంట్రాక్ దక్కుతుంది. ఇది ఇప్పటికి కాంట్రాక్టర్లకు ఎవరికి అంతు చిక్కని వ్యవహారం. దీనితో ఈ గోప్యం ఖరీదు ఎంత అనే ప్రశ్న పదేళ్లుగా ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటికి అయిన జిల్లా అధికారులు ఈ గుట్టు విప్పుతారో లేదో చూద్దాం.
ఏ నోటీసులు రాలేదు : ఆర్ఎంఓ, జీజీహెచ్
డైట్ కు సంబంధించి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. ఒకవేళ వస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.