స్వార్థ రాజకీయాల కోసమే బిఆర్ఎస్ నాటకాలు..?
* జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
రామారెడ్డి ,జూన్ 01 (ప్రజా జ్యోతి)
స్వార్థ రాజకీయాల కోసమే కల్వకుంట్ల కుటుంబం లేఖల నాటకాలు ప్రారంభించిందని జిల్లా పరిషత్ మాజీ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బి ఆర్ ఎస్ కు తగ్గుతున్న ఆదరణను, కల్వకుంట్ల కుటుంబంలో కుటుంబ కలహాలు, ప్రతిపక్ష హోదాలో వైఫల్యాన్ని , అవినీతిపై జరుగుతున్న విచారణను ప్రజల దృష్టి మళ్లించడానికి బి ఆర్ ఎస్, కల్వకుంట్ల కుటుంబం నాటకాలను ప్రారంభించిందని ఇది ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. త్వరలో వీరి నాటకాలు బయటపడతాయని, మరోసారి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న రాజకీయ కుటుంబ కలహాలను ప్రజలపై రుద్దుతామంటే ఊరుకునేది లేదని సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తామని మోహన్ రెడ్డి హెచ్చరించారు.