పర్వతగిరి, మే 28 (ప్రజాజ్యోతి)::
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో దొంగ నోట్ల చలామణి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మండల కేంద్రానికి చెందిన దుర్గా శ్రీ వైన్ షాప్ లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రోజు మద్యం కొనుగోలు చేసారు. వారు ఇచ్చిన డబ్బుల్లో దొంగ నోటు వచ్చినట్లు మీడియా కు తెలిపి మండల ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలంని షాప్ నిర్వాహకులు సూచించారు. తన వ్యాపారంలో వచ్చిన డబ్బులను గురువారం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా బ్యాంకు అధికారులు దొంగ వంద రూపాయల నోట్లు 2, 500 వందల రూపాయల నాటు ఒకటి గుర్తించినట్లు తెలిపాడు. దొంగ నోట్లు మండలంలో చలామణి చేస్తున్నారనే వ్యవహారం మండలంలో కలకలం సృష్టించింది.