మంత్రులు డబ్బులు తీసుకుంటారు.. కానీ నాకు వద్దు.. మంత్రి సురేఖ

Warangal Bureau
1 Min Read

వరంగల్

ఫైళ్ళు క్లియర్ చేయటానికి కొందరు మంత్రులు డబ్బులు తీసుకుంటారు.. కానీ నాకు వద్దు అంటూ మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ లో ఓ కాలేజీ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం ఆమె పాల్గొన్నారు. ‘తమ వద్దకు వచ్చిన కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అది సాధారణంగా జరిగేదే. కానీ నాకు మాత్రం నయాపైసా వద్దు. దానికి బదులు సమాజ సేవ చేయాలని చెబుతా’ అని చేసిన వ్యాఖ్యాలు చర్చనియంగా మారాయి

.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *