ప్రపంచ సుందరీమణుల విందు కార్యక్రమంలో పక్క పక్కనే రేవంత్ రెడ్డి, నాగార్జున

V. Sai Krishna Reddy
0 Min Read

ప్రపంచ సుందరి – 2025 పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిచ్చింది. నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో వీరికి ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సతీమణితో కలిసి హాజరయ్యారు.

పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పసందైన హైదరాబాదీ వంటకాలతో విందును ఆస్వాదించారు. ఈ విందుకు ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగార్జున ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *