గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి..

Warangal Bureau
0 Min Read

మరిపేడ, మే13 (ప్రజాజ్యోతి)::

గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కొత్త తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మరిపెడ పరిధి కొత్త తండాలో మంగళవారం దుర్గమ్మ పండగ నిర్వహించారు. తండాలోని బంధువుల ఇంటికి వర్ధన్నపేట శివారు బండ తండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్(68) పండగకు హాజరయ్యారు. ఈ క్రమంలో విందు భోజనం చేస్తుండగా లక్ష్మణ్ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. ఊపిరాడక అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. స్థానిక 108 కు సమాచారం అందించినప్పటికి ప్రాణాలు కాపాడలేకపోయారు.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *