ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులలో ఒకరైన గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో బాలాజీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మైసూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తో బాలాజీని విజయవాడకు తరలిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. భారతి సిమెంట్స్ కంపెనీలో గోవిందప్ప బాలాజీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కాగా, బాలాజీ అరెస్టుతో మద్యం కుంభకోణం కేసు