తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు తిరువన్నమలై నుంచి శ్రీవారి భక్తులుతో తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.