తోటి సహా ఉద్యోగి అని చూడకుండా.. లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఏసిబి కి చిక్కారు.. ములుగు జిల్లా జెడ్పి సూపరింటెండెంట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్య వీరిద్దరూ.. తోటి ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వద్ద 60 వేల లంచం డిమాండ్ చేయడంతో.. 60,000 ఇవ్వడం ఇష్టం లేని నల్లబెల్లి వెంకటేశ్వర్లు ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించారు.
అనారోగ్యం పాలై లీవ్ తీసుకున్న క్రమంలో మెడికల్ బిల్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపించడానికి ఇద్దరు ₹ 60,000/- డిమాండ్ చేశారు. ఏసీబీ డీఎస్సీ సాంబయ్య బృందం దాడులు జరిపి పట్టుకున్నారు. 20 వేల రూపాయలు సూపరింటెండెంట్ సుధాకర్, 5 వేలు జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటున్న సమయంలో రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.