ప్రవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు
• ముందస్తు బడిబాట కార్యక్రమం
• ఎంఈఓ ఛత్రు నాయక్
గరిడేపల్లి,మే 03(ప్రజా జ్యోతి):
ప్రవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని ఎంఈఓ ఛత్రు నాయక్ అన్నారు.శని వారం సూర్యాపేట జిల్లా గరిడే పల్లి జడ్పిహెచ్ఎస్,ఎంపీపీ ఎస్,ప్రాథమిక పాఠశాల, కీతవారిగూడెం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలు ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్స్,నోట్ బుక్స్,ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్,ఏకరూప దుస్తులు, రాగిజావా ఉచితంగా ఇస్తున్నామని,సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి.రవీందర్ రెడ్డి,బుచ్చిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ,సాయిలు,కేజీ. మోహినుద్దిన్, సత్యనారాయణ,నాగేందర్,శోభన,హైమావతి,కే.లక్ష్మీ నారాయణ,సీఆర్పీ రాతికింది రామకృష్ణ,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు చాగంటి వీరయ్య,శ్రీలత నాగయ్య,వీరస్వామి,పద్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.
ప్రవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు

Leave a Comment