వై టి పి ఎస్ అగ్ని ప్రమాద ఘటనపై… తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
ప్లాంట్ పరిశీలన, ప్రమాదంపై అధికారులతో ఆరా ..!
వెంటనే మరమ్మత్తులు చేసి, ట్రయల్ రన్ కు సిద్ధం చేయాలని ఆదేశాలు..!!
మిర్యాలగూడ, ఏప్రిల్ 28,( ప్రజాజ్యోతి ): నల్లగొండ జిల్లా దామరచర్ల (మం) యాదాద్రి థర్మల్ వర్క్ ప్లాంట్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై తక్షణమే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ( బి ఎల్ అర్ )హుటాహుటిన ప్లాంట్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీశారు.యూనిట్ వన్ లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ మరమ్మత్తులు చేస్తుండగా ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ప్లాంట్లో మొత్తం 5 బాయిలర్లు ఉండగా,వాటిలో మూడు బాయిలర్లు రన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, బాయిలర్ వన్ వద్ద మినహా, మిగిలిన వాటిలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపిన అధికారులు. త్వరితగతన ప్రమాదానికి గురైన బాయిలర్ గ్యాస్ కట్ ను రిపేరు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.బాయిలర్ రిపేరు చేసి 24 గంటల్లోపు రన్నింగ్ లోకి తీసుకువస్తా మని అధికారులు వెల్లడించారు.జరిగింది చిన్న ప్రమాదం ఆందోళన చెందవద్దని తెలిపిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ తెలిపారు.