టైర్ల షాపులో చెలరేగిన మంటలు….!

Nalgonda Bureau
1 Min Read

టైర్ల షాపులో చెలరేగిన మంటలు….!

 

కాలిన టైర్లు,సామాగ్రి… 10లక్షలు ఆస్తి నష్టం….!!

మిర్యాలగూడ, ఏప్రిల్ 25,( ప్రజాజ్యోతి ):నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న విజయలక్ష్మి టైర్ రి ట్రేడింగ్ షాపులో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని టైర్ల షాప్ యజమాని తెలిపారు .తనకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదని ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా మరి ఏదైనా కారణాలు ఉన్నాయని విచారణ జరుపుతున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *