హైదరాబాద్లోని ఆబిడ్స్లో పెను ప్రమాదం తప్పింది. ఓ భారీ భవన నిర్మాణంలో వినియోగిస్తున్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
దీంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలు ధ్వంసం కావడంతో భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.