★ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్
—————————————-
నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజా జ్యోతి) పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు నియమితులైన ‘రాష్ట్ర పరిశీలకురాలు భారతీ లక్పతి నాయక్’ ఈరోజు (శుక్రవారం) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేసి, నామినేషన్ల రిజిస్టర్లు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని పొరపాట్లకు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్డిఓ మైపాల్, తహసిల్దార్ కృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, స్థానిక ఎస్సై మురళి సంబంధిత ఎన్నికల అధికారులు ఉన్నారు.
నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి
Leave a Comment
